శ్రీ శారదామాత జీవితచరిత్ర Part 32
🌻🌻🌻🌻🌻🌻🌻 🌺శ్రీ మాత్రే నమః🌺 🌹 *శ్రీ శారదామాత జీవితచరిత్ర 🌹 3⃣2⃣ *వ రోజు* *రామ్ లాల్ 'కైంకర్యం' :--* 🌻🌻🌻🌻🌻🌻🌻 మాతృదేవి ఒక సంవత్సరం తర్వాత బృందావనం నుండి 1887 ఆగస్టులో తిరిగి వచ్చారు. కాశీపూర్ రోజులలో గురుదేవులు ఒక రోజు మాతృదేవిని పిలిచి, 'నా తదనంతరం నువ్వు *కామార్పుకూర్* కు(గురుదేవుల ఊరు) వెళ్లి, అక్కడ నివసించు. ఏమైనా ఆకు కూరలు పండించుకో. వట్టి అన్నమో, ఉడకబెట్టిన ఆకుకూరలో, దొరకింది తింటూ, ఆధ్యాత్మిక సాధనలు అనుష్టించు. కానీ ఒక విషయం . ఒక చిల్లికాసైనా ఎవరివద్దా చేయిచాచి యాచించవద్దు. చేతులు చాచావంటే నీ తలను కుదువ బెట్టినట్లే. భక్తులెవరైనా ప్రీతితో నిన్ను తమ ఇంట వుండమని ఆహ్వానించవచ్చు. ఆ ఆహ్వానాన్ని కూడా మన్నించకు. అంతకంటే బిచ్చమెత్తి జీవించడం ఉత్తమం. కామార్పుకూర్ లోని నీ సొంత ఇంటిని వదలవద్దు. తిండితిప్పలకు ఎలాంటి లోటు రాదు' అని చెప్పి ఉన్నారు. ఇక రాబోయే రోజులు దుఃఖమయంగా ఉంటాయని మాతృదేవికి తెలుసు. గురుదేవులు సజీవులై ఉన్నప్పుడే హృదయ్ ఆమెను అవమానపరచడం విదితమే. రామ్ లాల్(గురుదేవుల అన్న కొడుకు) అర్చకుడుగా నియమితుడయ్యాక గురుదేవులను గౌరవించడం మానుకొన్నా...
Comments
Post a Comment