🌻🌻🌻🌻🌻🌻🌻 🌺శ్రీ మాత్రే నమః🌺 🌹 *శ్రీ శారదామాత జీవితచరిత్ర 🌹 3⃣2⃣ *వ రోజు* *రామ్ లాల్ 'కైంకర్యం' :--* 🌻🌻🌻🌻🌻🌻🌻 మాతృదేవి ఒక సంవత్సరం తర్వాత బృందావనం నుండి 1887 ఆగస్టులో తిరిగి వచ్చారు. కాశీపూర్ రోజులలో గురుదేవులు ఒక రోజు మాతృదేవిని పిలిచి, 'నా తదనంతరం నువ్వు *కామార్పుకూర్* కు(గురుదేవుల ఊరు) వెళ్లి, అక్కడ నివసించు. ఏమైనా ఆకు కూరలు పండించుకో. వట్టి అన్నమో, ఉడకబెట్టిన ఆకుకూరలో, దొరకింది తింటూ, ఆధ్యాత్మిక సాధనలు అనుష్టించు. కానీ ఒక విషయం . ఒక చిల్లికాసైనా ఎవరివద్దా చేయిచాచి యాచించవద్దు. చేతులు చాచావంటే నీ తలను కుదువ బెట్టినట్లే. భక్తులెవరైనా ప్రీతితో నిన్ను తమ ఇంట వుండమని ఆహ్వానించవచ్చు. ఆ ఆహ్వానాన్ని కూడా మన్నించకు. అంతకంటే బిచ్చమెత్తి జీవించడం ఉత్తమం. కామార్పుకూర్ లోని నీ సొంత ఇంటిని వదలవద్దు. తిండితిప్పలకు ఎలాంటి లోటు రాదు' అని చెప్పి ఉన్నారు. ఇక రాబోయే రోజులు దుఃఖమయంగా ఉంటాయని మాతృదేవికి తెలుసు. గురుదేవులు సజీవులై ఉన్నప్పుడే హృదయ్ ఆమెను అవమానపరచడం విదితమే. రామ్ లాల్(గురుదేవుల అన్న కొడుకు) అర్చకుడుగా నియమితుడయ్యాక గురుదేవులను గౌరవించడం మానుకొన్నా...
🌻🌻🌻🌻🌻🌻🌻 🌺శ్రీ మాత్రే నమః🌺 🌹 *శారదామాత జీవితచరిత్ర🌹 3⃣5⃣ *వ రోజు* *భక్తుల అభ్యర్థన :--* 🌻🌻🌻🌻🌻🌻🌻 గురుదేవుల నిర్యాణానంతరం మాతృదేవి *ముప్పైమూడేళ్లు* జీవించారు. *"కామార్పుకూర్ లోని, నీ* *సొంత ఇంటిని వదలి* *వేయకు”* అంటూ గురుదేవులు చెప్పిన మాటలను ఆమె మరచిపోలేదు. ఆయన చెప్పినట్లే నివసిస్తూ తపోమయ జీవితం గడపాలనేదే ఆమె ఆశయం. కానీ పరిస్థితులు పూర్తిగా ప్రతికూలమయినందున అక్కణ్ణుండి కలకత్తా వెళ్లవలసి వచ్చింది. కొన్ని విషయాలలో గురుదేవులు చెప్పింది యధాతధంగా మాతృదేవి స్వీకరించేవారు కాదు. అలాంటి కొన్ని సంఘటనలు చూద్దాం. దక్షిణేశ్వరంలో కొంతమంది యువకులు గురుదేవుల దగ్గరకు వచ్చి రాత్రి సమయాల్లో కూడా ధ్యాన జపాదులు అనుష్టించసాగారు. రాత్రి ఎక్కువ ఆహారం తీసుకోవడం సాధనా జీవితానికి అవరోధం అని గురుదేవులు వారి వారి శక్తికి తగ్గట్లు ఇన్నీ చపాతీలే తినాలని నియమం పెట్టారు. ఒక భక్తుణ్ణి “నువ్వు రాత్రిపూట ఎన్ని చపాతీలు తింటావు?" అని అడిగారు. ఐదో, ఆరో" అన్నాడు. “చాలా ఎక్కువ. ఎందుకు అన్ని తింటావు?" అని మళ్లీ అడిగారు. అందుకు ఆ భక్తుడు మాతృదేవి పెట్టింది పెట్టినట్లే తిం...
🌻🌻🌻🌻🌻🌻🌻 🌺శ్రీ మాత్రే నమః🌺 *_🌹శ్రీ శారదామాత జీవితచరిత్ర🌹_* 1⃣8⃣ *వ రోజు* 🌻🌻🌻🌻🌻🌻🌻 ఎవరైనా బద్దకస్తులుగా ఉండడాన్ని గురుదేవులు సుతరామా ఇష్టపడరు. ఈ విషయంగా మాతృదేవి కాలాంతరంలో ఒక శిష్యురాలితో ఇలా అన్నారు: "గురుదేవులు నాతో, ' *ఎల్లప్పుడూ చురుగ్గా* *ఉండాలి.* ఏ పని చేయకుండా ఎప్పుడూ ఉండకూడదు. *బద్ధకం చోటుచేసుకుంటే పనికిమాలిన ఆలోచనలు మాత్రమే మనస్సులో తలెత్తుతాయి.* అంటూ అప్పుడప్పుడూ చెప్పేవారు. భక్తులు రావడం, ఆడడం, పాడడం, పారవశ్య స్థితులలో గురుదేవుల గది ఆనంద నిలయంగా ఉండేది. కానీ ఆయననే భర్తగాను, గురువుగాను, దైవంగాను స్వీకరించిన మాతృదేవి దాన్లో పాలుపంచుకోలేకపోయారు. 'నేను భక్తులలో ఒకరిగా ఉండివుంటే సదా ఆయన దగ్గరే ఉండేదాన్ని వారి అమృతవాక్కులను వినగలిగి ఉండేదాన్ని' అంటూ తపించిపోయేవారు. కానీ గడ్డిపోచకన్నా వినమ్రత, భూమి కన్నా సహనం సంతరించుకున్న మహోన్నత భక్తురాలయిన మాతృదేవి తమ తపనను బయటికి చూపకుండా, తమకంటూ ఎలాంటి ప్రత్యేక హక్కులను ఆశించలేదు. గురుదేవులకు చిన్నచిన్న సేవలను అప్పుడప్పుడూ వెళ్ళి అందించడంతోనే ఆమె తృప్తి పడ్డారు. అలాంటి సందర్భాలు దొరకనప్పుడు వా...
Comments
Post a Comment